ధర్మవరంలో వడదెబ్బతో వృద్ధురాలి మృతి

64చూసినవారు
ధర్మవరంలో వడదెబ్బతో వృద్ధురాలి మృతి
ధర్మవరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిమ్మలకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీబాయి (68) వడదెబ్బతో సోమవారం మృతి చెందింది. గ్రామం నుంచి పని నిమిత్తం పట్టణానికి వచ్చిన ఆమె కాలినడకన ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకోగానే వడదెబ్బకు గురై కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే లక్ష్మీబాయి మృతి చెందింది. ఆమెకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్