కేతిరెడ్డి నిజస్వరూపం బయటపడింది: మంత్రి

63చూసినవారు
కేతిరెడ్డి నిజస్వరూపం బయటపడింది: మంత్రి
ధర్మవరంలో కేతిరెడ్డి నిజస్వరూపం బయటపడిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం పేర్కొన్నారు. కేతిరెడ్డి ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లారు. గతంలో చేసిన తప్పులకు ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ది రాలేదు. జైలు జీవితం గడపాలని కోరిక ఉంటే త్వరలోనే తీరుస్తాం. కానీ ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించం. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్