పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించండి: కార్మికులు

59చూసినవారు
సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులు వేతనాల కోసం నిరసన కొనసాగిస్తున్నారు. ధర్మవరం నగరపాలిక పరిధిలోని ఎర్రగుంటలో త్రాగునీటి సరఫరా పథకం వద్ద శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళన నిర్వహించారు. నీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు.

సంబంధిత పోస్ట్