గర్భిణీలు పౌష్టిక ఆహారాన్ని తినాలి: డాక్టర్ ప్రియాంక

68చూసినవారు
గర్భిణీలు పౌష్టిక ఆహారాన్ని తినాలి: డాక్టర్ ప్రియాంక
ధర్మవరం పట్టణం కొత్తపేటలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం గర్భిణీలకు ఉచిత వైద్య సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక గర్భిణీలతో మాట్లాడుతూ.. పౌష్టికమైన ఆహారాన్ని గర్భిణీలో తినడం వల్ల పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యవంతంగా జన్మిస్తారని తెలిపారు. అనంతరం వారికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు.

సంబంధిత పోస్ట్