ధర్మవరంలో లేబర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ ధర్మవరం డివిజన్ కార్యదర్శి జేవీ రమణ ధర్మవరం ఆర్డీవోను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. గతంలో ధర్మవరంలో ఉన్న లేబర్ ఆఫీసుని జిల్లాల విభజనలో కొత్తచెరువుకి మార్చారని, అప్పటి నుంచి ధర్మవరంలో ఉన్న కార్మికులకు ఇబ్బందిగా ఉందన్నారు. ఇక్కడికే లేబర్ కార్యాలయాన్ని మార్చాల్సిందిగా కోరినట్లు జేవీ రమణ తెలిపారు.