రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

61చూసినవారు
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురానికి చెందిన పవన్ తన తమ్ముడు ఈశ్వర్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై కదిరిలో చీరలు అమ్మడం కోసం వెళ్తుండగా దారి మధ్యలో ట్రాక్టర్ వచ్చి బలంగా ఢీకొంది. ఘటనలో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా ఈశ్వర్ గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్