వాటర్ సప్లై కార్మికుల సమస్యను పరిష్కరించాలి

54చూసినవారు
వాటర్ సప్లై కార్మికుల సమస్యను పరిష్కరించాలి
బత్తలపల్లి మండలం మాల్యవంతంలో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం పదో రోజుకు చేరుకుంది. కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్మిక సంఘం నాయకులు మారుతి మాట్లాడుతూ. గత ఆరు నెలల నుంచి వేతనాలు అందక కార్మికులు సమ్మె చేస్తుంటే జిల్లా అధికారులు మాట్లాడక పోవడం శోచనీయం అన్నారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్