ధర్మవరం పట్టణానికి చెందిన రవివర్ధన్ అనే వ్యక్తిపై భార్య తరఫు బంధువులు బుధవారం దాడి చేశారు. భార్య ధనలక్ష్మితో విడాకుల గొడవలు ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని అతడు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.