ఇద్దరి అదృశ్యంపై ఫిర్యాదు

52చూసినవారు
ఇద్దరి అదృశ్యంపై ఫిర్యాదు
గుత్తి, గొందిపల్లికి చెందిన ఇద్దరు అదృశ్యమయ్యారు. గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీకొట్టు నిర్వహిస్తున్న వలీ కుమారుడు ఉపాధికోసం బెంగళూరుకు వెళుతున్నట్లు తల్లికి చెప్పి వెళ్లాడు. అతని ఫోన్ పనిచేయకపోవడంతో అతని తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొందిపల్లికి చెందిన ఓ మహిళ ఈనెల17 నుంచి కనిపించడంలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్