వ్యవసాయ పరికరాలు నిప్పు పెట్టారు

81చూసినవారు
కంబదూరు మండలంలోని గుద్దెళ్ల గ్రామంలో సన్న తిమ్మప్ప అనే రైతు పొలం నందు ఉంచిన 60 పైపులు, 20 గన్ లు, 15 కట్టలు లాటరీతో పాటు ఇతరత్రా వ్యవసాయ సామాగ్రి అంతా శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో కాలిపోయి మట్టిపాలైందని బాధిత రైతు ఆదివారం వాపోయారు. దీంతో సుమారుగా 1. 50 లక్షల రూపాయల దాకా నష్టం వాటిల్లిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతు అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్