కరిగానిపల్లి: గ్రామ శివారులోని కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

53చూసినవారు
కరిగానిపల్లి: గ్రామ శివారులోని కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు
కుందుర్పి మండలంలో సోమవారం తెల్లవారుజామున పిడుగు పడడంతో ప్రజలు భయాందోళన చెందారు. కరిగానిపల్లి గ్రామ శివారులోని రామచంద్రప్ప అనే రైతు వ్యవసాయ తోటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా చెట్టు దెబ్బతినింది. భారీ శబ్దానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అలాగే హిందూపురం మండలం పోచనపల్లిలో పిడుగుపాటుకు గురై లక్ష్మయ్య అనే రైతు మృతి చెందిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్