తిమ్మసముద్రం ఎస్సీకాలనీలో గత 4రోజులుగా విద్యుత్ అంతరాయం

80చూసినవారు
తిమ్మసముద్రం ఎస్సీకాలనీలో గత 4రోజులుగా విద్యుత్ అంతరాయం
కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా అంధకారం నెలకొందని కాలనీవాసులు మంగళవారం విలేఖరులకు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఎస్సీ కాలనీకి సరఫరా చేసే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చెడిపోయింది. దీంతో ఎస్సీ కాలనీవాసులు గత నాలుగు రోజులుగా అంధకారంలో మగ్గుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ రిపేరి చేయించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్