కళ్యాణదుర్గం పట్టణంలో సుమారు 300 దొంగ ఓట్ల నమోదుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని వివరాలతో పాటు ఆర్డిఓ రాణి సుస్మితకు నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ చార్జి ఉమన్న సూచన మేరకు కళ్యాణదుర్గం ఆర్డిఓ కార్యాలయంకి టిడిపి నాయకులు చేరుకుని మున్సిపాలిటీ పరిధిలో దొంగ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో పాటు ఆర్డీవోకు అందించారు. ఆర్డీవో స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.