మున్సిపల్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలి

56చూసినవారు
మున్సిపల్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలి
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను కమిషనర్ కు తెలియజేసిన పట్టించుకోవడం లేదని ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలిమప్ప ఆరోపించారు. ఆర్అండ్ బి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న, అధికారులు దృష్టి సారించకపోవడం సరికాదన్నారు. వచ్చే సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్