భక్తులతో కిటకిటలాడిన తిమ్మరాయస్వామి దేవాలయం

79చూసినవారు
కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని కొండపై వెలసిన తిమ్మరాయ స్వామి దేవాలయంలో శ్రావణమాసం చివరి శనివారం కావడంతో కర్ణాటక, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. తిమ్మరాయ స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంతో భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా పేరుగాంచారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్