నేడు చాకరపల్లి రైల్వే గేటు బంద్

71చూసినవారు
నేడు చాకరపల్లి రైల్వే గేటు బంద్
శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద రైల్వేగేటును శుక్రవారం మూసివేస్తున్నట్లు తహశీల్దార్ అంజనాదేవి ప్రకటనలో తెలిపారు. రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మతుల కారణంగా గేటు బంద్ చేస్తున్నారని అన్నారు. హిందూపురం, పెనుకొండ వైపు రాకపోకలు జరిపే వారు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని సూచించారు. రైల్వే శాఖ అధికారుల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత రాకపోకలు కొనసాగడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్