సోమందేపల్లిలో శ్రీచౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డిఎస్పీ

82చూసినవారు
సోమందేపల్లిలో శ్రీచౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డిఎస్పీ
సోమందేపల్లి మండల కేంద్రంలోని శ్రీచౌడేశ్వరిదేవాలయంలో అమ్మవారిని శుక్రవారం పెనుకొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త డిసి ఈశ్వరయ్య, తొగటవీర క్షత్రీయ సంఘం అద్యక్షుడు సిసి హరి డి ఎస్పీకి స్వాగతం పలికారు. ఆలయంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర్లు దంపతులను ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ ఐ రమేష్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్