శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని జిఐసి కాలనీలోని శ్రీవివేకానంద కళాశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో డిఎస్సీ కోచింగ్ సెంటర్ శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతగా చేపట్టిన రోజే 16, 457 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ చంద్రబాబు సంతకం చేశారన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.