

రొద్దం: మాజీ సీఎం జగన్ పై మంత్రి సవిత ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి సవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం రొద్దంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ చచ్చిపోయిందని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అడుగు పెడతానని మారం చేసిన జగన్ కు ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారన్నది తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ మైండ్ పనిచేయక ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంటలకంటే గంజాయి అధికంగా పండిచారని అన్నారు.