పెనుకొండలో ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు

82చూసినవారు
పెనుకొండ మండల కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరాయి. పెనుకొండలోని నారాయణమ్మ కాలనీలోకి మంగళవారం భారీగా వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లలో వర్షపునీరు చేరడంతో ప్రజల బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి వర్షపు నీరు ఇండ్లలోకి చేరకుండా వరద సహాయ చర్యలు చేపట్టాలని నారాయణమ్మ కాలనీ వాసులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్