పరిగి: జయమంగళి నదికి పోటెత్తిన వరద నీరు

51చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శ్రీరంగరాజుపల్లి వద్ద జయమంగళినది కి వరద నీరు పోటెత్తడంతో గంగమ్మ ఉదృతంగా ప్రవహిస్తోంది. పరిగి చెరువుకు హంద్రీ నీవా కాలువ నుండి నీటి ప్రవాహం వస్తోంది. పలు వాగులు, వంకలకు జలకళ సంతరించుకుంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. ప్రజలు, మహిళలు జయమంగళినది వద్ద కు చేరుకొని పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ ను తిలకించారు.

సంబంధిత పోస్ట్