మేకలపల్లిలో నీట మునిగిన పంట పొలాలు

53చూసినవారు
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండలం మేకలపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి మేకలపల్లి చెరువు నిండి మరవ పారుతోంది. ఈ నీటితో చెరువు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షం నీటిలో పోలాలు మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్