రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

1072చూసినవారు
పుట్టపర్తి మండలం వీరజిన్నయ్య గారి పల్లి క్రాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుట్టపర్తి నుంచి ఓడిసి వైపు ట్రాన్స్ఫార్మర్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఒడిసి కి చెందిన డ్రైవర్ అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్