పుట్టపర్తి లో ఓనం వేడుకలు

69చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఓనం వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు కేరళ భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి కేరళ వాయిద్యాలు వాయిస్తూ సత్య సాయి బాబా ను కీర్తించారు. ఈ సంగీత కచేరి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం భజనల తో సత్యసాయి గీతాలాపన చేసి భక్తిలో పరవశించిపోయారు. కేరళ భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం సత్య సాయి నామస్మరణతో పులకరించిపోయింది.

సంబంధిత పోస్ట్