రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

83చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కనగానపల్లి మండలం చంద్ర చర్ల గ్రామానికి చెందిన నారాయణస్వామి (54) శుక్రవారం ధర్మవరానికి ద్విచక్ర వాహనంలో పని నిమిత్తం వచ్చాడు. తిరిగి తన స్వగ్రామమైన చంద్రచర్లకు వెళ్తుండగా పోతుకుంట నుంచి వస్తున్న జీపు నారాయణస్వామి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనింది. ఘటనలో నారాయణస్వామి గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్