ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

81చూసినవారు
ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని బైరవని తిప్ప ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ మీడియాకి ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1647. 7 అడుగుల నీరు ప్రాజెక్టులో ఉందన్నారు. 1385 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్