ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులు వరద బాధితులకు సహాయం

56చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ దారులు వరద బాధితులకు సహాయం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే శ్రావణిశ్రీ స్వగ్రామమైన సిద్ధరాంపురం పంచాయితీ, కొండాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం వృద్ధాప్య పింఛన్ దారులు ముందుకు వచ్చి, 100 మంది ఒకొక్కరు రూ. 500లు చొప్పున రూ. 50, 000లు నగదు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కి బుధవారం అందజేశారు. అవ్వా తాతలు వరద బాధితులను ఆదుకోవడం బాధ్యతని తలచి, పింఛన్ డబ్బులు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్