ఓటు పండుగ కాదు, ఓటర్ ల సహనానికి పరీక్ష

1095చూసినవారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఓటు పండుగ కాదు, ఓటర్ ల సహనానికి పరీక్షగా మారింది. సోమవారం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి సాక్షంగా బుక్కరాయసముద్రం పాఠశాలలోని ఎన్నికల కేంద్రం ఉంది. జన సంద్రాన్ని తలపించేలా ఓటర్లు మూడు గంటలకు పైగా బారులు తీరారు. ఒ‍క పోలింగ్ కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో బూత్ లు ఉండటంతో వేల సంఖ్యల బారుతీరిన ఓటర్లు, పని చేయని ఈవీఎంలు అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. వృద్ధుల బాధలు వర్ణనాతీతం, వెనుతిరుగుతున్న కొద్దిమంది ఓటర్లు. కనీసం పట్టించుకునే వారు లేని పరిస్థితి నెలకొంది.

సంబంధిత పోస్ట్