తాడిపత్రిలో బైక్ చోరీ.. సీసీ కెమెరాలలో రికార్డు

561చూసినవారు
తాడిపత్రి పట్టణంలో నివాసం ఉంటున్న గుంతకల్లు డిప్యూటీ తహాసిల్దార్ మల్లేష్ ప్రసాద్ ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. పట్టణ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్డు నందు నివాసం ఉంటున్న డిప్యూటీ తహాసిల్దార్ మల్లేష్ ప్రసాద్ తన ఇంటి ముందు బైక్ ని పార్క్ చేసి ఉంచాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు మల్లేష్ ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్