శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు

51చూసినవారు
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే సహించబోమని యాడికి రూరల్ సర్కిల్ సీఐ రోషన్, ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. గురువారం పెద్దవడుగూరు స్థానిక పోలీస్టేషన్ లో పాత కేసుల్లోని రౌడీ షీటర్లు, నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఘర్షణలకు పాల్పడినా, గొడవలు చేయడానికి తోడ్పాటు అందించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్