తాడిపత్రి లో న్యాయవాదులు, పోలీసులకు వాగ్వాదం

1009చూసినవారు
తాడిపత్రి లో న్యాయవాదులు, పోలీసులకు వాగ్వాదం
తాడిపత్రి లో నామినేషన్ సందర్భంగా న్యాయవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ పోలీసులు స్థానిక కోర్టు ముందు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పని నిమిత్తం కోర్టు లోపలికి వెళ్లే న్యాయవాదులు, కక్షిదారులకు శుక్రవారం నాటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. దీంతో న్యాయవాదులు శ్రీనివాసులు, రాజగోపాల్ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై జిల్లా జిడ్జి కి ఫిర్యాదు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్