అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ తరఫున బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, ఫయాజ్ బాషా, అడ్వకేట్ శ్రీనివాసులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంభూపాల్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు.