దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నానది తీరాన వెలసిన శ్రీబుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు శనివారం శ్రీఅన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు చంద్రశేఖరశర్మ, నందుస్వామి, రామకృష్ణశర్మలు అమ్మవారికి కుంకుమార్చనలు, మహామంగళహారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారిని శ్రీఅన్న పూర్ణదేవిగా అలంకరించారు.