తాడిపత్రి మండలంలో శనివారం ఆర్టీవో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని అనంతపురం - కడప ప్రధాన రహదారిపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా వాహనాలలో పరిమితికి మించి ఎక్కించుకోరాదన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.