అనంతపురం జిల్లాలో వరుస దొంగతనాలు

59చూసినవారు
అనంతపురం జిల్లాలో వరుస దొంగతనాలు
అనంతపురం జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. శనివారం బూదగవి గ్రామంలో ధనుంజయ అనే రైతు ఇంట్లో రూ. 1. 40 లక్షల నగదు, 7 తులాల బంగారాన్ని దుండగులు అపహరించుకుని వెళ్లారు. అలాగే గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో 43 తులాల బంగారు నగలు చోరీ అయిన విషయం తెలిసిందే. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్