నూతన భవనాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

65చూసినవారు
నూతన భవనాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఉరవకొండ మండలం చిన్నముష్టూరులోని అనంతపురం, బళ్లారి 42వ జాతీయ రహదారికి పక్కనగల వైఎస్సార్ హెల్త్ క్లినిక్, ఆర్బికేలను దుండగులు ధ్వంసం చేశారు. రూ. 35లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాలను పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ సంబంధితశాఖకు అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొందరు వీటిపై దాడిచేసి కార్యాలయాలను ఇష్టానుసారం సర్వనాశనం చేశారు. శనివారం ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్