మహిళలకు రక్షణ కల్పించాలంటూ నిరసన తెలిపిన వైద్య సిబ్బంది

55చూసినవారు
బెళుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, శ్రీరంగాపురం వైద్యాధికారులు, వైద్య సిబ్బంది శనివారం కలకత్తాలో వైద్యాధికారిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ పట్టణ ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు సైతం పాల్గొని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు కార్తీ కుమార్ రెడ్డి, ప్రియాంక, లోకేష్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్