ఉరవకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. రాకెట్ల గ్రామం నుంచి కార్యకర్తలతో కలిసి ఆర్. ఓ కార్యాలయం చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ కు అందజేశారు.