ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రినీ తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి

84చూసినవారు
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రినీ తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి
విష జ్వరాలు అధికంగా ఉండడంతో ఆసుపత్రిలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి పాల్ రవికుమార్ అన్నారు. శనివారం ఆయన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ప్రతి వార్డును తిరుగుతూ రోగులతో మాట్లాడారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు వస్తున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్