నీట్‌లో ఉరవకొండ విద్యార్థి సత్తా

52చూసినవారు
నీట్‌లో ఉరవకొండ విద్యార్థి సత్తా
ఉరవకొండకు చెందిన భాను తేజసాయి నీట్‌లో 720 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఆయన తల్లిదండ్రులు లోకేశ్, వాణిలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. చిన్ననాటి నుంచి కొడుకును డాక్టర్ చేయాలన్న లక్ష్యంతో చదివించారు. భానుతేజ ఇంటర్ విజయవాడలో చదివి 986 మార్కులు సాధించాడు. న్యూరాలజిస్టుగా ప్రజలకు సేవలు అందించడం తన లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్