ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. వైసీపీ ఘోర పరాజయం చెందింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల వల్ల పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనిపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ‘మళ్లీ పనిలోకి దిగండి. ఏపీ సురక్షితమైన చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్పై దృష్టి పెట్టండి. వాళ్లు తప్పు చేశారని, మీరు అదే తప్పు చేయకండి. వాళ్లకు మీకు తేడా ఉంది.’ అని బ్రహ్మాజీ తెలిపారు.