కడప: అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం

56చూసినవారు
కడప: అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబానికి ఆర్థిక సాయం
బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఎ. ఎస్. ఐ ఆర్. అన్వర్ కుటుంబానికి జిల్లా అదనపు ఎస్. పి (పరిపాలన) కె. ప్రకాష్ బాబు రూ. 2. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కు రూపంలో అందచేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎ. ఎస్. ఐ ఆర్. అన్వర్ సతీమణి బీబీజాన్ కు అదనపు ఎస్పీ అందచేశారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ వితరణ నిధి నుండి దీనిని అందచేశారు.

సంబంధిత పోస్ట్