మదనపల్లెకి మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు. మదనపల్లె కదిరి రోడ్డు లోని ఇస్తిమా గ్రౌండ్ కు పరిసరాలతో పాటు పలు అనుమానిత ప్రాంతాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో వాహనాలు, వీధులు, అస్పత్రులు, లాడ్జిలు, ఇళ్ళ వద్ద తనిఖీచేశారు. సీఎం బస్సుయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.