మదనపల్లెలో మిన్నంటిన సంబరాలు

66చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో బుధవారం మదనపల్లె పట్టణంలోని కూటమి నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు యాగం చేశారు. యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద టీవీలతో ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు స్వీట్స్ పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్