రామసముద్రంలో సచివాలయాలం-2ను ఎమ్మెల్యే షాజహాన్ బాష గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను, హాజరు పట్టీలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. విధులకు ఆటంకం కలగకుండా సచివాలయ అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలలో జాప్యం లేకుండా చూడాలన్నారు.