లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

4726చూసినవారు
రైతు నుంచి లంచం తీసుకుంటూ విఆర్ఓ ఏసిబికి చిక్కిన సంఘటన శనివారం పీలేరులో చోటు చేసుకుంది. కెవి పల్లి మండలం, గోరంట్లపల్లి పంచాయతీ, బసిరెడ్డిగారిపల్లి వడ్డీపల్లికి చెందిన రైతు కోటకొండ మల్లయ్య నుంచి అదే మండలం, సొరకాయలపేట సచివాలయ వీఆర్ఓ ఊటుకూరి ఎల్లయ్య పీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రూ. 5000 లంచం తీసుకుంటూ ఎసిబి బృందానికి పట్టుబడ్డాడు. ఎసిబి బృందం నిందితుడిని నెల్లూరు ఏసిబి కోర్టులో హాజరుపరచనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్