కేంద్రీయ విద్యాలయ సంగతన్ 2024-25 అకడమిక్ సెషన్ కోసం 1 నుంచి 11 తరగతుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటుంది. 10 బోర్డు పరీక్షల ఫలితాలు ప్రకటించిన 10 రోజుల తర్వాత 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు kvsangathan.nic.in అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.