వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

75చూసినవారు
చిట్వేలి మండలం కే. కందులవారి పల్లిలో ఆదివారం ఉదయం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామ పురోహితుడు సుబ్బు స్వామి ఆధ్వర్యంలో కందుల చేలో మోహన్ రావు కుటుంబ సభ్యులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. గ్రామస్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణం దర్శించుకుని ప్రసాదాలు పంచిపెట్టారు. సాయంత్రం సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ వసంతోత్సవం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్