జనసేనకు మరో శుభవార్త

26831చూసినవారు
జనసేనకు మరో శుభవార్త
ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీకి మరో శుభవార్త. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును జనసేన పార్టీకి ఎన్నికల సంఘం (ఈసీ) శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6 శాతం చొప్పున ఓట్లు రావాలి. కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. దాంతో ఇకపై జనసేనకు సింబల్ టెన్షన్ తీరనుంది.

సంబంధిత పోస్ట్