ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై 70వేలకు పైగా ఓట్ల తేడాతో భారీ మెజారిటీ గెలిచారు. దీంతో జనసేన పార్టీ ఫాలోవర్స్, ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకుంటుంది. ఇక ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పవన్ గెలుపు ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది.